మెగా వరుస హిట్లు.. ఇక మిగిలింది ఆ ఒక్కడే!

బాక్సాఫీస్ దగ్గర మెగా హీరోలు వరుస హిట్లతో సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి సినిమాలతో భారీ విజయాలు అందుకోగా, ఇటీవల వరుణ్ తేజ్ కూడా ‘కొరియన్ కనకరాజు’తో సాలిడ్ కమ్బ్యాక్ ఇచ్చాడు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి బాక్సాఫీస్ బరిలో దిగేందుకు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ఆయన కూడా కచ్చితంగా బ్లాక్బస్టర్ కొడతారని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.



