వెలిగొండ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్

AP: వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులో ప్రారంభించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షించారు. కృష్ణా జలాలను విడుదల చేసి నల్లమలసాగర్ జలాశయాన్ని నింపనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 99శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను నెలాఖరులోపు పూర్తి చేస్తామన్నారు. టన్నెళ్లలో CC లైనింగ్, TBM మిషన్ తొలగింపు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.



