రేపు హైదరాబాద్లో విద్యార్థుల వరుస నిరసనలు

TG: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో రేపు హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టనున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాచౌక్ వద్ద ప్రొటెస్ట్ చేయనున్నారు. ఓయూ విద్యార్థులు కూడా నిరసనల్లో పాల్గొననున్నారు.



