పొలాల్లో ఎగిసిపడ్డ మంటలు

TG: కాకినాడ రూరల్ మండలంలోని పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ ప్రాంతాలకు పొగ దట్టంగా అలుముకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం చూసిన స్థానికులు టెన్షన్ పడ్డారు. వెంటనే పైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రైతులే ఎండిపోయిన పంటలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయా, లేదా గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే మంట పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



