ఈ బామ్మ గారి దేశ భక్తికి హేట్సాఫ్ !
బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ మాతృభూమిపై ప్రేమతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ తీసుకున్న ఆమె ఇప్పుడు తన శేషజీవితాన్ని పుట్టిన గడ్డపైనే గడపాలని నిర్ణయించుకున్నారు. 'నా చివరి శ్వాస ఇక్కడే విడవాలి. అంత్యక్రియలు సొంత ఊర్లోనే జరగాలి' అంటూ తనకు త్వరగా భారత పౌరసత్వం ఇవ్వాలని ఆమె కలెక్టర్ ను కోరారు. ఈ వృద్ధురాలి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

