వేల మంది ముందరే ఇంక్ దాడి!

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో విద్యార్థుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోటీ పరీక్షల అక్రమాలపై అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై ఒక వ్యక్తి నల్ల సిరా (Black Ink) చల్లాడు. సుమారు వేయి మందికి పైగా విద్యార్థులతో కలిసి ర్యాలీగా వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి దాడులకు భయపడేది లేదని నేహా స్పష్టం చేయగా, ఇంక్ చల్లిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



