ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట

TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గత ఏడాది నుండి రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ల జీవితాలను ఇరకాటంలో పడేసిందని బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.




