అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలంగాణ యువకుడు బ్రెయిన్ డెడ్

TG: నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్కు చెందిన నిత్యానందరెడ్డి(26) అమెరికా రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. మూడేళ్ల క్రితం MS చదవడానికి అమెరికా వెళ్లిన అతను చదువు పూర్తిచేసుకుని అక్కడే ఉద్యోగంలో చేరారు. మిషిగన్లోని డెట్రాయిట్లో బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమించి మృతి చెందాడు



