‘హుషారు పిట్టలు’ ట్రైలర్ విడుదల
యూత్ఫుల్ కథాంశంతో వస్తోన్న కొత్త చిత్రం ‘హుషారు పిట్టలు’ ట్రైలర్ ఇవాళ విడుదలైంది. అన్షు, వాసవి గణేషన్ జోడీగా నటిస్తున్న ఈ సినిమాకు బిక్షు డైరెక్టర్. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్పై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజవుతోంది. ట్రైలర్లో యూత్కు కనెక్ట్ అయ్యే అంశాలతో పాటు ప్రేమ, స్నేహం, భావోద్వేగాలు, వినోదం వంటి అంశాలకు ప్రిఫరెన్స్ ఇచ్చారు.



