ఓటర్ లిస్ట్పై 4 రోజులు స్పెషల్ క్యాంపెయిన్

AP: ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ఈ ప్రత్యేక క్యాంపెయిన్ డేస్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా రోజుల్లో BLOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు అందుబాటులో ఉండి ఓటర్ల నమోదు, దరఖాస్తుల పూర్తి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.



