భోగాపురంలో తొలి Flight.. ఏటికొప్పాక బొమ్మలతో స్వాగతం
AP: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 6E 6408 విమానం 6.45 గంటలకు భోగాపురంలో దిగింది. ప్రయాణికులకు అధికారులు ఎటికొప్పాక బొమ్మలు అందించి స్వాగతం పలికారు. ఉదయం 7.30 గంటలకు భోగాపురం నుంచి హైదరాబాద్కు తొలి విమానం బయలుదేరింది. హైదరాబాద్, బెంగళూరుకు ఇండిగో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ–భోగాపురం మధ్య 20 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు.



