← Back to news

లక్షకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్!

By Balakrishna· 30 Jul 2026· india
లక్షకు పైగా స్కూళ్లలో ఒక్కరే టీచర్!

భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు లక్షకు పైగా (1,00,843) ఒక్క టీచర్ తోనే నడుస్తున్నాయని UDISE+ 2025–26 డేటా ఆధారం తో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో 16,357 సింగిల్-టీచర్ పాఠశాలలు ఉన్నాయి. ఇది దేశం మొత్తంలో 16శాతం పైగా ఉంది. తెలంగాణలో ఇలాంటి స్కూళ్లు 4,793 ఉన్నాయి. ఏపీ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లోనే దేశంలోని 65శాతం సింగిల్-టీచర్ స్కూళ్లు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ లోపాల వల్లే ఈ ప్రాబ్లమ్ వచ్చిందని గవర్నమెంట్ రాజ్యసభలో చెప్పింది.

More in Education