← Back to news

బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!

By Mahesh· 20 Aug 2026· TG
బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ రెడీ!

TG: రాష్ట్రంలో స్టూడెంట్స్‌కు డ్రగ్స్‌, పొగాకు వంటి మత్తు ప్రొడక్ట్స్‌ను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం మూడేళ్ల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయనుంది. స్కూల్స్ చుట్టూ 500 మీ. పరిధిని Drug Free Zoneగా ప్రకటించనున్నారు. డ్రగ్స్‌ అమ్మినా, వాడినా హెడ్‌మాస్టర్, నోడల్‌ టీచర్లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. స్టూడెంట్స్‌కు అవేర్‌నెస్‌తో పాటు టీచర్లుకు ట్రైనింగ్, కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నారు. స్టేట్‌లో 42వేల గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్ వంటి స్కూళ్లు <a href="https://tofei.education.gov.in/">NMV</a> పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

More in Education