ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్కూల్కు

TG: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్నగర్ గ్రామస్థులకు వర్షాకాలం వచ్చిందంటే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. భారీ వర్షాలకు గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విద్యార్థుల చదువు సమస్యగా మారింది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులతో పాటు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో మరో పది మంది చిన్నారులకు కూడా అక్కడే బోధన అందిస్తున్నారు. ఉపాధ్యాయుడు రత్నపాల్ గ్రామస్థుల సహాయంతో వాగు దాటి పాఠశాలకు చేరుకుని తరగతులు నిర్వహిస్తున్నారు.



