← Back to news

హాస్టల్‌లో ఉండలేక బయటకు వచ్చిన విద్యార్థులు

By DK· 15 Jul 2026

మంచిర్యాల జిల్లా చెన్నూరు మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో వసతుల సమస్యలతో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు హాస్టల్ విడిచి బయటకు వచ్చారు. మంగళవారం రాత్రి 17మంది స్టూడెంట్స్ ఎమ్మెల్యే సతీమణి సురేఖను కలిసి సమస్యలను వివరించారు. సమస్యలను విన్న సురేఖ, వారిని జిల్లా కోఆపరేటివ్ అధికారి శ్రీధర్‌కు అప్పగించి, సురక్షితంగా చెన్నూరుకు తరలించేలా చర్యలు తీసుకున్నారు. గురుకులంలో వసతులను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో వసతులు లేకపోవడం, ఫుడ్‌పాయిజన్ ఘటనలతో స్టూడెంట్స్ భయాందోళనకు గురవుతున్నారు.

More in Education