పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలంలోని అయోధ్యపుర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం వేడుకగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొందుర్గ్ మండల అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సులోచన కృష్ణ రెడ్డి, సర్పంచ్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




