స్ట్రీట్ లైట్స్ వెలగక ప్రజల అవస్థలు

AP: శ్రీకాకుళం జిల్లా మందస మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో స్ట్రీట్ లైట్స్ పనిచెయ్యట్లేదని, రాత్రుల్లో హైస్కూల్ నుంచి కాలేజ్ రోడ్డు జంక్షన్ దారిలో వెళ్లాలంటే విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పండా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్య పరిష్కరించాలంటూ మందస MPDO వెంకటరమణను కోరుతూ విజ్ఞాపనా పత్రం అందజేశారు. పన్నుల డబ్బుతో లేదా ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో కచ్చితంగా వీధి దీపాలను గ్రామ పంచాయతీ ఏర్పాటు చెయ్యాలని కోరారు.



