← Back to news

ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !

By డీకే· 23 Jun 2026· Eenadu· తిరుపతి జిల్లా
ఆటోలో క్యాంపస్‌కు.. పట్టుదలకు సెల్యూట్ !

AP: తిరుపతి జిల్లా సత్యవేడుకు చెందిన తుపాకుల మణికి ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సీటు వచ్చింది. ధ్రువపత్రాల పరిశీలనకు YSR కడప జిల్లా ఇడుపులపాయలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్కే వ్యాలీ క్యాంపస్‌కు వెళ్తుండగా దారిలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో మణి కాళ్లకు గాయాలయ్యాయి. హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కదల్లేని స్థితిలో ఉన్నా ప్రవేశపత్రం పొందాలని ఆటోలోనే క్యాంపస్‌కు చేరుకుంది. క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా ఆటో వద్దకు వచ్చి ఆమెకు ప్రవేశపత్రం అందించారు.

More in Education