కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట

TG: కల్లుగీత కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నియోజకవర్గంలోని 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాల నుంచి కార్మికులను రక్షించడంతోపాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ సేఫ్టీ కిట్ల ఉద్దేశమని తెలిపారు.





