లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం లూటీ

AP: చిత్తూరు జిల్లాలో లిక్కర్ లోడుతో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. చిత్తూరు-పుత్తూరు మార్గంలో బసిరెడ్డిపల్లి సమీపంలో వ్యాన్ బోల్తా పడడంతో మద్యం సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఆ దారిలో వెళ్లే వారు మద్యం బాక్సులు ఎత్తుకుపోయారు. మరికొందరు లుంగీలు, టవళ్లలో మద్యం సీసాలు దోచుకెళ్లారు. సీసాల కోసం ఎగబడిన వారిలో మహిళలు సైతం ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు అంతా సర్దుకుపోయారు.



