← Back to news

ప్రజాసమస్యలపై కమిటీలు చొరవ చూపాలి: గుత్తా

By DK· 26 Aug 2026· హైదరాబాద్
ప్రజాసమస్యలపై కమిటీలు చొరవ చూపాలి: గుత్తా

TG: ప్రజా సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి అవసరమైన సూచనలు చేయడంలో శాసన కమిటీలు కీలకపాత్ర పోషించాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు. శాసనమండలి సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం, వెనకబడిన తరగతుల సంక్షేమం, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కమిటీలు పర్యవేక్షించాలని అన్నారు.

More in TG