విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు

TG: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా హయత్నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీసీ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, నాయకులు నిరసన చేపట్టారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నాలో, సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.8వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



