పసుపు కొమ్ములతో భారీ గణేష్!

విజయనగరం జిల్లా రాజాం మండలం బద్దం గ్రామంలో భారీ గణపతి కొలువుదీరాడు. 150 కిలోల పసుపు కొమ్ములతో 15 అడుగుల ఎత్తులో విగ్రహం తయారు చేశారు. ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో 21 రోజుల శ్రమతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకుండా పూర్తిగా పర్యావరణహితంగా చేశారు. నవరాత్రి పూజలు, నిమజ్జనం తర్వాత పసుపు కొమ్ములను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది ఎకో-ఫ్రెండ్లీ వినాయకుడు కదా! మీ ఊరిలో కూడా ఇలాంటివి పెడితే మాకు ఫొటో, వార్త పంపండి.


