గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నం

AP: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో దూకడంతో తీవ్ర విషాదం నింపింది. పంచాయతీరాజ్ శాఖలో AEగా పనిచేస్తున్న నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకారు. గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించి మనవడిని రక్షించారు. వెంటనే అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా నూకరాజు, మీనా, సౌజన్య గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు ముమ్మరం చేశాయి.



