← Back to news

రేపు సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర

By విశీ· 18 Aug 2026
రేపు సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర

AP: 10వ తరగతి స్టూడెంట్ సుగాలి ప్రీతి హత్యాచార ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2017లో కర్నూలులో జరిగిన ఈ అన్యాయంపై బాధితురాలి తల్లి పార్వతి నేటికీ పోరాటం చేస్తున్నారు. ఆగస్టు 19వ తేదీ ప్రీతి మరణించిన రోజు. ఈ సందర్భంగా ప్రీతి తల్లి పార్వాతి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్‌చైర్ యాత్ర చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడాలని, ఈ కేసుకు సంబంధించి పూర్తి నిజాలు వెలికితీసి న్యాయం చేయాలని కోరుతున్నారు.

More in AP