విద్యార్థిని చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

AP: పల్నాడు జిల్లా మాచవరం మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరి ఇంజనీరింగ్ చదువుకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి రూ.3,65,500 ఉన్న ఫీజు, బకాయిలను రూ.2.50 లక్షలకు తగ్గించారు. ఇందులో రూ.1.25 లక్షలను ఇప్పటికే చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని వచ్చే ఏడాది చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. కుటుంబ ఖర్చుల కోసం రూ.50 వేలు, విద్యా ఫీజు కోసం రూ.2.50 లక్షలు కలిపి మొత్తం రూ.3 లక్షలను ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి అందించారు.



