AP రోడ్లపైకి 5,500 ఎలక్ట్రిక్ బస్సులు!..మరో 500 సిఎన్జి బస్సులు

ఆర్టీసీలో కాలం చెల్లిన, ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దశలవారీగా మొత్తం 6వేల బస్సులు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేయగా, ఇందులో విద్యుత్ బస్సులు 5,500, సీఎన్జీ బస్సులు 500 ఉంటాయి. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సిటీ బస్సుల్లో కాలం చెల్లినవి ఏవేవి ఉన్నాయో, వాటి స్థానంలో విద్యుత్ బస్సులను అవే సర్వీసులుగా నడపనున్నారు. ప్రధానమంత్రి ఈ-బస్ సేవ పథకం కింద 750 విద్యుత్ బస్సులు రాష్ట్రానికి కేటాయించారు. వీటిని 11 నగరాల్లోని 12 డిపోల పరిధిలో అద్దె ప్రాతిపదికన నడుపుతారు. వీటిలో 300 బస్సులు జులైలో రోడ్డెక్కనున్నాయి.



