గచ్చిబౌలిలో కూలిన బిల్డింగ్.. స్పాట్కు చేరుకున్న MLA

TG: ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాద ఘటన జరిగింది. అంజయ్యనగర్లో కన్స్ట్రక్షన్లో ఉన్న ఏడంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీ స్పాట్కు చేరుకున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కు పాల్పడిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ప్రమాదానికి సంబంధిత అధికారులు, ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని అన్నారు.



