రాష్ట్రంలో ‘వైట్ గోల్డ్’ వేట.. లిథియం నిక్షేపాలపై ఫోకస్

AP: రాష్ట్రంలో కీలక ఖనిజాల రిసెర్చ్పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కడప బేసిన్లోని వేంపల్లె ఏరియాల్లో లిథియం, గాలియం నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతోంది. CSIR–NGRI, రాష్ట్ర గనులు–జియాలజీ శాఖల మధ్య CM చంద్రబాబు నాయుడు సమక్షంలో అగ్రిమెంట్ కుదిరింది. గనుల రంగంలో రీసెర్చ్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ కోసం IIT(ISM) ధన్బాద్–టెక్స్మిన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ మధ్య మరో అగ్రిమెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు.



