ధర్మేంద్ర తప్పుకోవాల్సిన అవసరం లేదు: కేంద్రం

NEET పేపర్ లీకేజీ కలకలంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని ఎన్డీటీవీ మీడియా సోర్సులు తెలియచేస్తున్నాయి. "రాజీనామా చేయడం అత్యంత తేలికైన నిర్ణయం" అని, ప్రభుత్వం మంత్రికి పూర్తి అండగా నిలుస్తుందని కేంద్ర వర్గాలు అన్నాయి. NTA లోపాలను సవరించి లీకేజీ గ్యాంగ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.



