దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలో 1999లో ప్రభుత్వం 73 మంది దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రజాసంఘాల నాయకులు ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్ల చొప్పున సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఇళ్ల స్థలాలు, స్మశాన వాటిక, పోరంబోకు భూముల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని తహసీల్దార్ను కోరారు. పిడియం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటనాయక్, పాల్గొన్నారు.



