స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. అక్టోబర్ నెలా ఖరులోగా స్థానిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముందు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనుంది. గతంలో ఇచ్చి న హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించగా, పట్టణ ప్రాంతాల్లో 33.1 శాతం రిజర్వే షన్లు అమలు చేయాలని నిర్ణయించింది.



