← Back to news

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన

By Prabhakar.K· 16 Aug 2026· Parkal, Parkal, Hanumakonda
పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన

హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. నియోజకవర్గ స్వరూపాన్ని మార్చేలా రూ.484.42 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 100 పడకల ఏరియా ఆసుపత్రి & డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, లక్ష్మణ్ ,పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వరంగల్ ఎంపీ కడియం కావ్య ,ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన

More in Local