← Back to news

ఆడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన 10th స్టూడెంట్!

By sahani· 17 Aug 2026· AP

AP: మన్యం జిల్లా సాలూరు గవర్నమెంట్ హైస్కూల్‌లో తీవ్ర విషాదం జరిగింది. పాఠశాల ఆవరణలోని పాత వాచ్‌మన్ రూమ్ ప్రహరీ వాల్ అకస్మాత్తుగా కూలిపోవడంతో 10వ క్లాస్ స్టూడెంట్ అరుణ్ తేజ (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థులు ఆడుకుంటూ ఆ పాత గోడపై కూర్చోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు కాగా, వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఈ విషాద ఘటనతో స్కూల్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది.

More in AP