హిమాచల్లో భారీ వర్షాలు.. 157 మంది మృతి

హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు, సడన్ ఫ్లడ్స్తో తీవ్ర నష్టం ఏర్పడింది. జూన్ 30 నుంచి ఆగస్టు 9 వరకు వర్షాల కారణంగా 157 మంది మృతి చెందగా, 257 మంది మిస్ అయ్యారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. ఇందులో 68 మంది వరదలు, కొండచరియల కారణంగా, 89 మంది రోడ్డు యాక్సిడెంట్స్లో చనిపోయారు. 259 రోడ్స్ క్లోజ్ అవ్వగా, దాదాపు రూ.886 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఎక్కువగా మండి జిల్లాలో 120 రోడ్లు మూసుకుపోయాయి.



