ఏం సినిమా బ్రో.. కోట్లు కొల్లగోడుతూనే ఉంది!

బాలీవుడ్లో ‘ధురంధర్’ భారీ వసూళ్లతో రికార్డ్ సృష్టిస్తే.. ‘హనుమాన్ అంష్’ మాత్రం ఇన్వెస్ట్మెంట్పై భారీ లాభాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. నీమ్ కరోలి బాబా జీవితం ఆధారంగా ఈ భక్తి బయోపిక్ని సుమారు 2 కోట్ల రూపాయల బడ్జెట్తో తీశారు. ఇది 35 రోజుల్లో దాదాపు 193 కోట్ల రూపాయల ఇండియా గ్రాస్ సాధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ధురంధర్తో బాలీవుడ్ కోలుకోగా.. హనుమాన్ అంష్తో బాలీవుడ్ మళ్లీ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పిస్తోంది.



