← Back to news

CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు

By DK· 27 Aug 2026· హైదరాబాద్
CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్‌రావు

TG: పదేళ్ల KCR పాలన ప్రజలే కేంద్రంగా సాగితే.. ప్రస్తుత రేవంత్‌ పాలన మాత్రం భూములే కేంద్రంగా సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌ KPHBలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫైరయ్యారు. 22ఏ జాబితా నుంచి భూములను తొలగించకపోతే వచ్చే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేస్తామని, CM స్పందించకుంటే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వం రూ.30వేల కోట్ల విలువైన భూములు విక్రయించిందని ఆరోపించారు.

More in TG