← Back to news

మహిళపై 15 అడుగుల కొండచిలువ దాడి

By BK· 6 Aug 2026· Youtube· TG

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో పొలం పనుల్లో ఉన్న స్వప్న అనే మహిళా రైతుపై 15 అడుగుల భారీ కొండచిలువ దాడి చేసి, చుట్టుముట్టి మింగేందుకు ప్రయత్నించింది. ఆమె ప్రాణభయంతో పెట్టిన కేకలు విన్న తోటి రైతులు, కూలీలు వెంటనే అక్కడికి చేరుకుని ధైర్యంతో కొండచిలువను తరిమికొట్టి ఆమెను కాపాడారు. ఆ పామును గోనె సంచిలో బంధించి, స్వప్నను చికిత్స కోసం జనగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

More in News