కళాశాలకు తాళం వేసి ధర్నా

TG: నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని PG కాలేజ్ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలకు తాళం వేసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. TC కోసం కాలేజ్కు వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపల్ అనుచితంగా ప్రవర్తించడంతో ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.



