జంతర్మంతర్ నిరసనల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు: రామ్దేవ్

దేశం వీధుల్లో కాదు, పార్లమెంట్ ద్వారానే నడుస్తుందని యోగా గురు రామ్దేవ్ అన్నారు. జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న కొందరు భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీశారని రామ్దేవ్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ఎవరు అనేది ప్రధాని, పార్లమెంటే నిర్ణయిస్తుందన్నారు. బ్రాహ్మణవాదం, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతి అని, తల్లిదండ్రులు, గురువులు చూపిన మార్గంలో నడవాలని ఆయన సూచించారు.



