Latest

డబ్బు కంటే నిజాయితీ గొప్పదని చాటిన స్వీపర్
AP: పోగొట్టుకున్న పర్సును భక్తురాలికి తిరిగి అందజేసి మఠం స్వీపర్ రాముడు నిజాయితీ చాటుకున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సావిత్రమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన పర్సును మఠం ప్రాంగణంలో పోగొట్టుకున్నారు. అందులో రూ.2,500 నగదు ఉన్నట్లు తెలిపారు. పర్సు మఠంలో పనిచేస్తున్న స్వీపర్ రాముడికి దొరకడంతో వెంటనే మఠం యాజమాన్యానికి అప్పగించారు. అనంతరం యాజమాన్యం సమక్షంలో పర్సును, అందులోని నగదును సావిత్రమ్మకు రాముడు తిరిగి అందజేశారు.

అప్పులు తీర్చలేక దొంగతనాల బాట
TG: కామారెడ్డిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విద్యుత్నగర్ కాలనీలో నివాసముంటున్న మామిండ్ల లావణ్య ఇంట్లో ఈ నెల 7న దొంగతనం జరిగింది. దుండగుడు 16 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.90వేల నగదును అపహరించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో అతడు దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్గా గుర్తించారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.

శ్రావణ మాసం ఎఫెక్ట్.. పోటెత్తిన భక్తులు
TG: శ్రావణ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా కోటిలింగాల శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెల్గటూర్ మండలంలోని పవిత్ర గోదావరి తీరంలో ఉన్న శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరి నది తీరం భక్తుల సందడితో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

బాలాపూర్ గణేశుడి కోసం ఈసారి అదిరిపోయే థీమ్ రెడీ!
TG: తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాపూర్ గణేశుడు ఈసారి కొత్తగా దర్శనమివ్వనున్నాడు. ఏటా ప్రముఖ ఆలయాల నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు.. ఈసారి ఒడిశాలోని ఫేమస్ పూరీ జగన్నాథస్వామి టెంపుల్ నమూనాలో మండపాన్ని డిజైన్ చేస్తున్నారు. గతంలో శ్రీశైలం, యాదాద్రి, కనకదుర్గ, అయోధ్య, అరుణాచలం ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నిద్రిస్తున్న అన్నపై తమ్ముడి దాడి
AP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన వజ్రాల సుబ్బరాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటసుబ్బయ్య, చిన్న కుమారుడు సురేష్. ఇద్దరూ మద్యానికి బానిస కావడంతో ఇద్దరు భార్యలు వదిలివేశారు. వెంకటసుబ్బయ్య ఇంట్లో నిద్రిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న సురేష్ గొడ్డలితో అతడి తలపై దాడిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరోసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలతో వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. SI శివప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ఆటోల స్థానంలో ఈవీలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ను స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ మార్పిడి పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా CURE పరిధిలోని అర్హత కలిగిన పెట్రోల్, డీజిల్ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్ ఆటోలతో భర్తీ చేయడం ఈ పథకం లక్ష్యం.

రఫేల్ నుంచి ఏఐ వరకు.. భారత్–ఫ్రాన్స్ బంధం
రఫేల్, సబ్మెరైన్స్తో మొదలైన భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం ఇప్పుడు మరింత పెద్దదవుతోంది. రెండు దేశాలు ఏఐ, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, సైబర్ టెక్నాలజీ, స్టార్టప్స్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ఫోకస్ పెంచుతున్నాయి. 2026లో ఇన్నోవేషన్ రోడ్మ్యాప్ 2030, జాయింట్ ఏఐ వర్కింగ్ గ్రూప్ వంటి కొత్త కార్యక్రమాలు కూడా వచ్చాయి. స్పేస్లో ఇస్రో–సీఎన్ఈఎస్ సహకారం, న్యూక్లియర్ ఎనర్జీలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై అవకాశాలు కూడా చర్చలో ఉన్నాయి.

నత్తనడకన ROB పనులు.. కాంగ్రెస్ నాయకుల ధర్నా
TG: మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ROB నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిర్వహించిన నిరసనలో 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి మాట్లాడారు. ROB పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐదునిమిషాల్లో చేరాల్సిన ప్రయాణానికి గంట సమయం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. MP బండి సంజయ్ ఎన్నికల సమయంలో శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు.

TET పాసైన వారికి గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే పోస్టులు!
AP: TET పాసైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6,534 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3,597 SGT, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. SGTలకు నెలకు రూ.10,000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 జీతం ఇస్తారు. ఈనెల 21లోగా సంబంధిత MEO ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయినవారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దసరాకు ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ Dates గుర్తుపెట్టుకోండి!
దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి రైల్వే టికెట్ బుకింగ్పై అడ్వాన్స్ ప్లానింగ్ అవసరం. ఈ ఇయర్లో దసరా అక్టోబర్ 20న ఉంది. <a href="https://www.irctc.co.in/nget/train-search">IRCTC</a>లో ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ 60 రోజుల ముందే అందుబాటులోకి వస్తాయి. దీంతో అక్టోబర్లో వచ్చే దసరా సెలవులకు ఆగస్ట్ 16 నుంచి <a href="https://www.irctc.co.in/nget/train-search">IRCTC</a> వెబ్సైట్బు/యాప్లో టికెట్స్ Availableగా ఉంటాయి. పండగ టైమ్లో ఊళ్లకు వెళ్లే రైళ్లన్నీ రష్గా ఉంటాయి. టికెట్స్ ఓపెన్ కాగానే బుక్ చేసుకుంటే ఫ్యామిలీతో సేఫ్గా, కంఫర్ట్గా జర్నీ చేయవచ్చు.

మీతో మీరే మాట్లాడుకుంటారా? 👀
మనతో మనమే మాట్లాడుకుంటూ ఉండటం చూసి “నేను మాత్రమే ఇలా చేస్తున్నానా?” అనిపిస్తుందా? 😄 నిజానికి Self-talk అనేది చాలా సాధారణమైన విషయమే. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ఆలోచనలను సర్దుకోవడం, పనులను ప్లాన్ చేసుకోవడం, ఫోకస్ పెంచుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, కష్టమైన పనికి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం సాధ్యమవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇది మనసులోనే జరగొచ్చు.. కొన్నిసార్లు బయటకు మాట్లాడుకోవడం కూడా సహజమే. అయితే ఎప్పుడూ మనల్ని మనమే తక్కువ చేసుకునే Negative Self-talk మాత్రం మంచిది కాదు.

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡
మనకు AIతో ఒక పని చేయడానికి కొన్ని సెకన్లే పడొచ్చు.. కానీ దాని వెనుక భారీ డేటా సెంటర్లు 24/7 పనిచేస్తుంటాయి. AI మోడళ్లను నడిపే శక్తివంతమైన GPUలు భారీగా విద్యుత్ను ఉపయోగిస్తాయి. ఈ కంప్యూటింగ్తో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్ని తగ్గించేందుకు కూలింగ్ సిస్టమ్స్, కొన్ని చోట్ల నీటిని కూడా ఉపయోగిస్తారు. IEA ప్రకారం 2025లో ప్రపంచ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 17% పెరిగింది. 2030 నాటికి ఇది 945 TWhకు చేరొచ్చని అంచనా. AI వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్తో పాటు నీటి అవసరం కూడా మరింత పెరగొచ్చు.

నాగర్కర్నూల్ ఇన్చార్జిగా సాయిబాబు
TG: ఆధార్ పార్టీ నాగర్కర్నూల్ అసెంబ్లీ ఇన్చార్జిగా గోవిందు సాయిబాబును నియమించింది. తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన గోవిందు సాయిబాబును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈదా శేషగిరిరావు (ESR) నియమించినట్లు హిమాయత్నగర్లోని పార్టీ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

సీఎం రేవంత్ పర్యటన.. పరకాలలో ట్రాఫిక్ ఆంక్షలు
TG: CM రేవంత్రెడ్డి హన్మకొండ జిల్లాలోని పరకాల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పరకాల CI క్రాంతికుమార్ తెలిపారు. ఇవాళ CM పర్యటన సందర్భంగా పట్టణంలో రద్దీని నియంత్రించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. హుజూరాబాద్, భూపాలపల్లి, హనుమకొండ వైపు వెళ్లే ప్రైవేట్ వాహనదారులు పోలీసుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని కోరారు. మొగుళ్లపల్లి ఎక్స్ రోడ్డు, మాదారం కాలనీ, సీఐఎస్ఐ కాలనీ, జయ్ కాన్వెంట్ స్కూల్ మీదుగా వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు.

చికెన్ ధరలపై శ్రావణం ఎఫెక్ట్.. నేటి రేట్లు ఇవే!
శ్రావణ మాసం ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు (ఆగస్టు 16) హైదరాబాద్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.222, డ్రెస్డ్ చికెన్ రూ.197గా ఉంది. విజయవాడలో స్కిన్లెస్ చికెన్ రూ.240, డ్రెస్డ్ చికెన్ రూ.212గా ఉంది. శ్రావణ మాసం సందర్భంగా కొందరు నాన్వెజ్కు దూరంగా ఉండటంతో డిమాండ్లో మార్పులు కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏరియానీ బట్టి ధరల్లో కొంచెం తేడాలు ఉంటాయని తెలిపారు.

రైల్వే స్టేషన్లో నీళ్లు తాగుతున్నారా? CAG Big Alert 🚨
రైల్వే స్టేషన్ల తాగునీటిపై CAG ఆడిట్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 512 స్టేషన్లలో చెక్ చేస్తే, 458 స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేవు. తాగునీటి కూలర్లలో E-coli బాక్టీరియా పాజిటివ్ వచ్చిన లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. <br>వాష్రూమ్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని రిపోర్ట్ చెప్పింది. CAG ఈ రిపోర్ట్ పార్లమెంటుకు సమర్పించింది.

విద్యార్థిని అలీనా కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
TG: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు కొమ్మ విరిగిపడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందడం విషాదం నింపింది. యాదాద్రి జిల్లా భువనగిరి భగాయత్ జడ్పీ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలులకు భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి విద్యార్థులపై పడటంతో ఏడుగురు గాయపడ్డారు. వారిలో అలీనా అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అలీనా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.

వానలతో పాటు బలమైన గాలులు.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. నార్త్వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో AP, తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. APలో నార్త్ కోస్ట్, యానాం, సౌత్ కోస్ట్, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో వర్షాలు, పిడుగుల ముప్పు ఉందని సూచించింది.

రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా హత్యే
AP: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద జూలై 22న జరిగిన జయరాం(44), రవీంద్ర (45) మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తొలుత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా ఇంటి స్థల వివాదమే హత్యలకు కారణమని తేలింది. ప్లాన్ ప్రకారం ఇద్దరినీ ట్రాలీ ఆటోతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు శివప్రసాద్, శరణ్ రాజ్లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
బడి కోసం 8 కి.మీ. నడక.. దొనబైలు పిల్లల ఆవేదన!
AP: 'సార్.. మా గ్రామానికి రోడ్డు వేయండి.. మేము బడికి వెళ్లాలి' అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర్లోని దొనబైలు గ్రామ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. సరైన రోడ్డు లేకపోవడంతో స్టూడెంట్స్ ప్రతిరోజూ దాదాపు 8 కి.మీ. నడిచి స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, రైతులు, కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ టైమ్లో హాస్పిటల్కు చేరుకోవడం కష్టంగా మారిందని, గ్రామానికి త్వరగా రోడ్డు వేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

‘August Theory’ అంటే ఏంటి?
ఆగస్టు వచ్చింది.. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ఆగస్టు థియరీ’ అనే డేటింగ్ ట్రెండ్ తెగ చర్చలో ఉంది. ఈ థియరీ ప్రకారం ఆగస్టు వచ్చేసరికి కొందరు తమ పాత రిలేషన్షిప్స్, సిట్యుయేషన్షిప్స్ గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెడతారట. దూరమైన వ్యక్తి మళ్లీ మెసేజ్ చేయడం, పాత కనెక్షన్స్ తిరిగి స్టార్ట్ అవ్వడం లేదా కొన్ని రిలేషన్షిప్స్కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడటం జరగొచ్చనేది ఈ వైరల్ ఐడియా. అయితే “ఆగస్టు వచ్చింది కాబట్టి Ex తిరిగొస్తాది” అని వెయిట్ చేయకండి బ్రో😂.. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు.