రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా హత్యే

AP: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద జూలై 22న జరిగిన జయరాం(44), రవీంద్ర (45) మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తొలుత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా ఇంటి స్థల వివాదమే హత్యలకు కారణమని తేలింది. ప్లాన్ ప్రకారం ఇద్దరినీ ట్రాలీ ఆటోతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు శివప్రసాద్, శరణ్ రాజ్లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.



