Latest

బాలీవుడ్ యాక్టర్కు భారీ షాక్.. ఆస్తుల వేలం
బాలీవుడ్ యాక్టర్ రాజ్పాల్ యాదవ్కు ఫైనాన్సియల్, లీగల్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.16.61 కోట్ల లోన్ కట్టకపోవడంతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఉన్న ఆయన ఆస్తులను వేలం వేయాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. సెప్టెంబర్ 9న ఆన్లైన్లో ఈ-వేలం నిర్వహించనున్నారు. 'అటా పటా లాపటా' సినిమా కోసం తీసుకున్న లోన్కు భార్య రాధా యాదవ్, తల్లి గోదావరి యాదవ్ ఆస్తులను కూడా తాకట్టు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

మంత్రులు ఎందుకు తప్పించుకుంటున్నారు?: మల్లికార్జున ఖర్గే
‘దేశంలోని 140 కోట్ల ప్రజలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాం. హోం మంత్రి, ప్రధాన మంత్రి హౌస్కు రావాలని కోరుతున్నాం. ఛైర్ హోం మంత్రిని స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించాలని కోరుతున్నాం. చర్చకు మేము సిద్ధం. అయినా నిజమైన ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభుత్వం తప్పించుకుంటోంది’ అని కాంగ్రెస్ పార్లమెంట్ సభాపక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘డిస్రప్షన్ కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో భాగమే’ అని గతంలో బీజేపీ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

బోనాల్లో ఈవ్టీజర్లకు షాక్.. 678 మందిపై కేసులు
TG: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో మహిళల సేఫ్టీ కోసం షీటీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టాయి. గుళ్ల దగ్గర మహిళలను వేధించిన 678 మంది ఈవ్టీజర్లను సీసీటీవీ ఫుటేజ్, వీడియో ప్రూఫ్స్తో గుర్తించి కేసులు బుక్ చేశారు. ఇంక్వైరీ తరువాత నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి శిక్షలు వేశారు. 36 మందికి జైలు శిక్షతో పాటు రూ.1,050 ఫైన్ వేసింది. మరో 26 మందికి ఫైన్తో పాటు సోషల్ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది. మహిళలను హరాసింగ్ చేస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
యూత్ ప్రొటెస్ట్లు మోదీని బలహీనపరిచాయి: సోనమ్ వాంగ్చుక్
ఇటీవల యువత నాయకత్వంలో జరిగిన ప్రొటెస్ట్లు ప్రధాని నరేంద్ర మోదీని బలహీనపరిచాయని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ అన్నారు. నిరాహార దీక్ష సమయంలో 11 కిలోలు తగ్గానని, ఇప్పుడు 6 కిలోలు పెరిగానని చెప్పారు. దీక్ష చివరి ఆరు రోజులు తనను బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించారు. ప్రస్తుతం దేశ వాతావరణం మారిపోయిందని, యువత ఇప్పుడు దేశంలో మార్పు తీసుకురాగలదని చెప్పారు. దేన్నీ భరించాల్సిన అవసరం లేదని అన్నారు.

అనామిక ఖన్నా ఫ్యాషన్ మ్యాజిక్
ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ అనామిక ఖన్నా తన 'AK|OK' బ్రాండ్తో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. లండన్లోని ఫేమస్ సెల్ఫ్రిడ్జెస్ (Selfridges) స్టోర్లో తన ఫస్ట్ ఇంటర్నేషనల్ 'రిజార్ట్ 2027' కలెక్షన్ను లాంచ్ చేశారు. ట్రావెలింగ్, టూర్ల టైంలో కంఫర్ట్గా ఉండేలా కాటన్, సిల్క్, లైట్ క్రాఫ్ట్ డిజైన్స్తో తయారు చేసిన ఈ బట్టలు ఇంటర్నేషనల్గా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మన ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్ని గ్లోబల్ ట్రెండ్కి తగ్గట్టు మార్చి అనామిక ఖన్నా ఒక కొత్త ఫ్యాషన్ ట్రెండ్ని స్టార్ట్ చేశారు.

భారీగా పెరిగిన బంగారం ధరలు!
గోల్డ్ లవర్స్కి అలర్ట్! గురువారం మార్కెట్లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.3,980 పెరిగి రూ.1,49,730 కి చేరగా, 22 క్యారెట్ల రేట్ రూ.3,650 పెరిగి రూ.1,37,250 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల ధర రూ.1,12,300 గా నమోదైంది. మార్కెట్లో రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతాయి, కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసే ముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోవడం బెటర్!

కాళేశ్వరం కాల్వలో ప్లాట్లు.. కొనుగోలుదారులకు షాక్
TG: మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెంగడ్డ తండాలో ఎలాంటి అనుమతులు లేకుండా SR వెంచర్ పేరుతో ప్లాట్లు విక్రయించి కోట్ల రూపాయల మోసం జరిగినట్లు బాధితులు ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కల్లూరి సుభాష్రెడ్డి సుమారు 70మందికి ప్లాట్లు విక్రయించగా, వాటిలో సగానికి పైగా కాళేశ్వరం కాల్వ పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఆరు సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

YSRCP దీక్షలో ఉద్రికత్త..టెంట్ తొలగింపు
AP: DSC అక్రమాలపై బాధ్యత వహించి మంత్రి నారా లోకేశ్ రిజైన్ చేయాలంటూ YSRCP రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. గుంటూరు, అనంతపురం జిల్లా, విజయవాడ సెంట్రల్ ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై పర్మిషన్లు లేకుండా టెంట్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ TDP నాయకులు టెంట్లను తొలగించారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సీఎం చంద్రబాబు, లోకేశ్లపై కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా హెచ్చరించారు.

ఆసుపత్రిలో ఫోన్ ఛార్జింగ్ కష్టాలు
TG: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో రోగుల సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వార్డుల్లో ఉన్న మొబైల్ ఛార్జింగ్ పాయింట్లకు ఆసుపత్రి సిబ్బంది స్టిక్కర్లు వేసి మూసివేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు ఛార్జ్ చేసుకునే అవకాశం లేక అత్యవసర సమయంలో వైద్యులను, కుటుంబ సభ్యులను సంప్రదించలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోగుల సేవలో ఉండే తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. వెంటనే స్పందించి ప్రత్యేక మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని కోరారు.
మెడికోపై కారు ఎక్కించిన యువకులు
AP: రాజమండ్రిలోని అప్పారావు రోడ్డులో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ని ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టారు. కిందపడిన ఆమెపై నుంచే కారు పోనిచ్చారు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. మెడికోను స్థానిక ఆసుపత్రికి తరలించగా, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. నామవరానికి చెందిన ఇద్దరు యువకులు తప్పతాగి స్పీడ్గా కారు నడుపుతుండగాఈ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గాయంతో భీమవరంలో వరుణ్ తేజ్ జోరు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్లలో స్పీడు పెంచారు. వరుణ్ కాలికైన గాయం ఇంకా తగ్గకపోయినా, భీమవరంలోని ఒక కాలేజీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్కి వచ్చి సందడి చేశారు. 2018లో ‘తొలిప్రేమ’ ఈవెంట్ ఇక్కడే జరిగిందని, అప్పటి మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో, రితీకా నాయక్ హీరోయిన్గా, థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలోకి వస్తోంది.

క్షుద్రపూజల ఆరోపణలపై హరీశ్రావు మాస్ వార్నింగ్
TG: BRS నేత, మాజీ మంత్రి హరీశ్రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన క్షుద్రపూజల ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వర్షాలు పడకుండా తాను క్షుద్రపూజలు చేశానని ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దులు ఉండాలని, నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇప్పటికే సంబంధిత కాంగ్రెస్ నేతలకు న్యాయ నోటీసులు పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అంశాలను తాము ప్రశ్నిస్తున్నందుకే తనపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

Evening Fat Burning Workout
అధిక బరువు, కొవ్వుతో బాధపడేవారికి 'Evening Fat Burning Workout' ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ సాయంత్రం 60 Squats, 1 నిమిషం Plank, 30 Tricep Dips, 30 High Knees, Mountain Climber, 50 Crunches, 50 Push Ups, 50 Jumping Jacks చేయడం వల్ల శరీరంలో అనవసర కొవ్వు సులువుగా కరుగుతుంది. వర్కౌట్ ముందు 5-10 నిమిషాల Warm Up తప్పనిసరి. మధ్యలో 30-60 సెకన్ల బ్రేక్ తీసుకుంటూ, తగినన్ని నీళ్లు తాగుతూ క్రమం తప్పకుండా చేస్తే అద్భుతమైన ఫిట్నెస్ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలిసారిగా!
AP: రాష్ట్రంలో హస్తకళలకు టెక్నాలజీని జోడిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సూచనలతో దేశంలో తొలిసారిగా హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్కు క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చింది. ‘లేపాక్షి’ ఆధ్వర్యంలో స్పెషల్గా డిజైన్ చేసిన క్యూఆర్ కోడ్ వ్యవస్థను స్టార్ట్ చేశారు. కళాఖండంపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే పూర్తి ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో ఫేక్ హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్స్కు అడ్డుకట్ట పడటంతో పాటు, ఏపీ కళలకు మంచి గుర్తింపు వస్తుందని అధికారులు తెలిపారు.

తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలు!
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ ఆశయాలకు నివాళులర్పించారు.

బస్సు కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్
TG: జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామంలోకి RTC బస్సు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ గ్రామం బయట ఉన్న స్టేజి వరకు వెళ్లి బస్సు ఎక్కాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కలిసి స్టేజి వద్ద ధర్నా నిర్వహించారు. గ్రామంలోకి RTC బస్సును నడిపి విద్యార్థులను అక్కడి నుంచే ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.

తరుణ్ తేజ్పాల్ దోషి: బాంబే హైకోర్టు
ప్రముఖ జర్నలిస్ట్, తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ను గోవా బెంచ్(బాంబే హైకోర్ట్) రేప్ కేసులో దోషిగా నిర్ధారించింది. 2021లో ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసిన తీర్పును ఈ కోర్టు కొట్టేసింది. 2013లో గోవాలో జరిగిన తెహల్కా ఈవెంట్లో ఎలివేటర్లో మాజీ కొలీగ్పై అత్యాచారం చేశాడని ఆయన మీద కేసు నమోదైంది. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు ఆయన్ని నిర్దోషిగా విడుదల చేయగా, హైకోర్టు ఆయన్ని దోషిగా గుర్తించింది.
ఆసుపత్రిలో కూలిన పైకప్పు భాగం
రాజస్థాన్ రాష్ట్రం సుజంగఢ్లో ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఎంట్రెన్స్ పైకప్పులో కొంతభాగం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. మహిళను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఆసుపత్రి భవనం చాలా పాతదని అక్కడున్నవాళ్లు అంటున్నారు.

కూలిన ఇంటి పైకప్పు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా పాత ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోయారు. పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 28 ఏళ్ల వ్యక్తి పెద్ద గాయాలై ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. కోత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులీ వార్డులో ఈరోజు ఉదయం 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జాగినట్లు పోలీసులు వెల్లడించారు.

ఒక్క నిర్లక్ష్యం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
AP: కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం తోలగంగనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప నుంచి కూరగాయలు, ప్రయాణికులతో కమలాపురం వైపు వెళ్తున్న ఆటో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు ఆటో ముందు భాగం దెబ్బతినగా, కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. గాయపడిన ఇద్దరికి స్థానికులు, 108 అంబులెన్స్ సిబ్బంది కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

పోషకాలతో నిండిన Fruit Timetable
ఉదయాన్నే అరటిపండు తింటే వెంటనే ఎనర్జీ, పైనాపిల్ తింటే మెటబాలిజం పెరుగుతుంది, అలాగే ఖాళీ కడుపుతో యాపిల్ తింటే అరుగుదల బాగుంటుంది. మధ్యాహ్న పూట ఆరెంజ్, మామిడి, పుచ్చకాయ లాంటివి తింటే శరీరానికి శక్తితో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది, శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. భోజనం చేశాక బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. రాత్రి పడుకునే ముందు కివీ పండు తింటే మంచి నిద్ర పడుతుంది. పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం పెరిగి స్కిన్ బాగా గ్లో అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.