← Back to news

ఒక్క నిర్లక్ష్యం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

By dk· 6 Aug 2026· కడప జిల్లా
ఒక్క నిర్లక్ష్యం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

AP: కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండలం తోలగంగనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప నుంచి కూరగాయలు, ప్రయాణికులతో కమలాపురం వైపు వెళ్తున్న ఆటో రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఢీకొన్న తీవ్రతకు ఆటో ముందు భాగం దెబ్బతినగా, కూరగాయలు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. గాయపడిన ఇద్దరికి స్థానికులు, 108 అంబులెన్స్ సిబ్బంది కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.