AP· 3 Jul 2026
పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం
AP: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్కు చెందిన ఆవుల వీరక్కకు, కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి ఆటోతోపాటు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అలకనంద(19), అంకాలు(20), నగేష్(17), చిన్నారి నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లికూతురు వీరక్కతోపాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.