← Back to news

దేశంలోనే వైజాగ్ టాప్ ప్లేస్

By DK· 1 Jul 2026· విశాఖపట్నం జిల్లా
దేశంలోనే వైజాగ్ టాప్ ప్లేస్

AP: విశాఖపట్నం దేశంలోనే శ్రామికశక్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిందని కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైయింది. ఈ నగరంలో ఉన్న జనాభాలో 52.8% మంది శ్రామికశక్తే. ఏదో ఒక పనిచేస్తున్న వారే. దేశవ్యాప్త సగటు (49.8%)తో పోలిస్తే విశాఖలోనే పని చేస్తున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నగరంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్న జనాభా కూడా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సగటుతో పోలిస్తే ఎక్కువగానే ఉంది. విశాఖలో 56.2% మంది పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ క్యాజువల్ లేబర్ రోజువారీ వేతనం రూ.733 జాతీయ పట్టణ సగటు (రూ.624) కంటే ఎక్కువ.

More in AP