← Back to news

వాయిస్ మెసేజ్‌తో ప్రభుత్వానికి ఫిర్యాదు

By DK· 30 Jun 2026
వాయిస్ మెసేజ్‌తో ప్రభుత్వానికి ఫిర్యాదు

AP: ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల పనితీరుపై CM సమీక్షించారు. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, దీని కోసం ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్ ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరించాలని, నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, రాబోయే మూడు నెలల్లో సమస్య పరిష్కరించేలా నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు.

More in AP