AP· 27 Jun 2026
అల్లూరి జిల్లాలో మలేరియా అలజడి
AP: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల తీవ్రత పెరుగుతోంది. దోమల బెడద, కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం తదితర సమస్యలతో ఇన్ఫెక్షన్ల ప్రభావం ఎక్కువవుతోంది. సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగీ, గన్యా జ్వరాలతో ఆసుపత్రులకు తాకిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో గతేడాది 7,119 మలేరియా కేసులు నమోదవ్వగా.. వారిలో ఎనిమిది మంది మరణించారు. ఈ ఏడాది జూన్ వరకు 2,392 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఏడుగురు మృతి చెందారు. అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,133 మలేరియా కేసులు నమోదయ్యాయి.