AP మహిళలు కష్టపడి పనిచేస్తారు

AP: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెంలో హీరో మోటోకార్ప్ సంస్థ రూ.750 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 'గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0' కు CM చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పవన్ ముంజాల్తో కలిసి ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. '2018లో హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకున్నప్పుడు, వారితో చర్చించి ఇక్కడే రూ.1,600 కోట్లతో ప్లాంట్ ఏర్పాటుచేసేలా ఒప్పించామన్నారు. AP మహిళలు కష్టపడి పనిచేస్తారు, త్వరగా నైపుణ్యాలు నేర్చుకుంటారు. హీరో ప్లాంట్లో 40% మంది మహిళలే పనిచేస్తుండటం గర్వకారణం అని అన్నారు.



