భారీ ఖనిజ సంపద గుర్తింపు

AP: రాష్ట్రవ్యాప్తంగా 62,030 చదరపు కిలోమీటర్ల పరిధిలో మినరల్ మ్యాపింగ్ చేసినట్లు CM చంద్రబాబుకు గనుల శాఖ నివేదించింది. ఇందులో విలువైన 125 ఖనిజాలు లభ్యమయ్యే ప్రాంతాలు ఉన్నాయని వివరించింది. ఈ నివేదికపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మినరల్ మ్యాపింగ్పై CMకు ఆ శాఖ నివేదిక సమర్పించింది. దీనిప్రకారం క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్కు సంబంధించి 48, అధికవిలువ కలిగిన బల్క్ మినరల్స్కు సంబంధించి 47, మరో 30 అతివిలువైన ఖనిజాలు లభ్యమయ్యే మినరల్ పొటెన్షియల్ ఏరియాలు ఉన్నాయి.



